NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వంగ ధర బోర్లా పడింది!
బొబ్బిలి, రామభద్రపురం ప్రాంతాల్లో వంగ ధర ఒక్కసారిగా బోర్లా పడిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గతేడాది కిలో రూ.20 ఉండగా, ఇప్పుడు కేవలం రూ.3కు పడిపోవడం రైతులకు తీవ్ర నష్టం తెచ్చిపెట్టింది. రవాణా ఛార్జీలు కేటుకు రూ.50 పడుతుండగా, మార్కెట్లో ధర మాత్రం చాలా తక్కువగా ఉండడం వల్ల రైతులు దోపిడీకి లోనవుతున్నారు. గతేడాది 200 ఎకరాల్లో సాగు చేసిన వంగను, ఈసారి 450 ఎకరాలకు పెంచడంతో, ఇతర ప్రాంతాల్లో కూడా సాగు పెరిగింది. దీంతో రవాణా కూడా 50 శాతానికి తగ్గింది. నిల్వ సామర్థ్యం లేక రైతులు అడిగిన తక్కువ ధరకే పంట అమ్మకానికి వెనకాడలేక పోతున్నారు. 50 సెంట్లలో రూ.40 వేలు పెట్టుబడి పెట్టి పండించిన వంగ, మొత్తం రూ.10 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ట్రంప్ సుంకాలతో మామిడి ఎగుమతులపై పడనున్న భారం !!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 26% ప్రతీకార సుంకాలు భారతీయ మామిడి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని మామిడి రైతులు ఈ ఎగుమతులపై కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. మామిడి పండ్ల ఎగుమతులు ఈ సుంకాల పెంపుతో తగ్గిపోతున్నాయి. ఇండియా మొత్తం మీద 7,64,500 ఎకరాల్లో మామిడి సాగుతూ, ఏటా 24,45,900 టన్నుల ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 45,000 టన్నుల మామిడి అమెరికాకు ఎగుమతవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 10,000-15,000 టన్నులు అమెరికా ఎగుమతవుతుంది. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ రూ.150-230 కోట్లు, కానీ ట్రంప్ సుంకాల కారణంగా ధరలు రూ.50 కోట్లు పెరిగే అవకాశముంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వరంగల్ మార్కెట్లో బంగినపల్లి మామిడికి రికార్డు ధర!
వరంగల్ ఎనుమాముల ముసలమ్మ కుంటలో గురువారం ప్రారంభమైన నూతన మామిడి మార్కెట్లో తొలి రోజే బంగినపల్లి మామిడి రికార్డు ధర సాధించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన రైతు విజయపాల రెడ్డి తీసుకువచ్చిన బంగినపల్లి మామిడిని టన్నుకు రూ.1.22 లక్షలకు కొనుగోలు చేశారు. మార్కెట్ చరిత్రలో మామిడికి ఇంత గరిష్ట ధర నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తేనే టీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం
NBB మరియు NBHM ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయ శంకర్ యూనివెర్సిటి రాజేంద్రనగర్ లో 10-02-2025 నుండి 15-02-2025 వరకు శాస్త్రీయ తేనే టీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ ఉచితం. భోజనం మరియు వసతి ఉచితంగా కల్పించబడును. తేనే టీగల పెంపకం గురించి తెలుసుకోవాలనుకునే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
టమాటా ధర భారీగా పతనం
టమాట పంటతో రైతులకు కష్టాలు తప్పట్లేదు. తాజాగా మెదక్ నర్సాపూర్ లో ఒక రైతు 2 ఎకరాల్లో 7,500 K G ల టమాటా పంటను దున్నేసి కాల్చేశారు. కిలో 2/- ఉండటంతో కూలీ కర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. కర్నూల్ జిల్లాలో టమాటా కేజీ కి పడిపోయింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు!
అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తుంది . మొక్కలకు 90శాతం సబ్సిడీ, డ్రిప్కు ఎస్సీ ఎస్టీలకు 100శాతం, బీసీలకు 80శాతం, నాలుగేళ్ల వరకు నిర్వహణకు ఎకరాకు రూ.4.200 అందిస్తుంది. నాలుగు సంవత్సరాల నుండి పంట దిగుబడి మొదలై 35 సంవత్సరాల వరకు వస్తుంది. ఈ పంటకు చీడపీడల బాధ తక్కువే, అధిక వర్షాలను కూడా తట్టుకుంటుంది. ఎకరాకు 8 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లొచ్చు: సీఎం చంద్రబాబు!
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ ధాన్యాన్ని ఏ మిల్లుకైనా తీసుకెళ్లే స్వేచ్ఛ ఉందని సీఎం తెలిపారు. అలాగే, సేకరించిన ధాన్యం పేమెంట్ను 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మ్యాజిక్ రైస్ వేడి నీళ్ళు లేకుండా అన్నం రెడీ!!
అగోనిబోరా రైస్ లేదా మ్యాజిక్ రైస్ పాలక్కాడ్లో ఉన్న ఎలప్పుల్లి లోని అథాచి గ్రూప్కి చెందిన వ్యవసాయ క్షేత్రం ద్వారా సాగు చేయబడింది. ఉడికించే అవసరం లేకుండా కేవలం వేడి నీటిలో 15 నిమిషాలు లేదా చల్లని నీటిలో 30 – 45 నిమిషాలు నానబెడితే చాలు ఉడికిపోతుంది. జూన్ లో ప్రారంభం అయిన పంట ఇటీవల పంట కోతకు వచ్చింది. విత్తనాలను మొలకెత్తించి 20 రోజుల తరువాత పొలంలో నాటారు. ప్రకృతి వ్యవసాయంలో పండించారు. కీటకాల బెడద చాలా తక్కువగా ఉంది. వరి మొక్క 3 అడుగుల ఎత్తు వరకు పెరిగింది. 100 – 110 రోజులలో కోత కోశారు. 12 సెంట్లు భూమిలో 170 కిలోలు వరి పండించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
🌧️ఏపీకి భారీ వర్షాలు: బంగాళాఖాతంలో అల్పపీడనం 🌀
బంగాళాఖాతంలో శనివారం ఏర్పాడే అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వానగండం పొంచి ఉంది. పంటలు చేతికొచ్చే కాలం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. దీని ప్రభావంతో నవంబర్ 26,27తేదీలలో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులకు గుడ్ న్యూస్ – యాసంగిలో రాయితీపై యంత్రాలు !!
తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు, ఉపకరణాలను సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకం కింద రోటావేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు అందిస్తామని తెలిపారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.