21 Jun , 2023

రైతులకు తొలకరి శుభవార్త !!

ఆలస్యమైన నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన కదలిక మొదలైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తోలకరులు ఆరంభమైనవి. రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తరించి 24, 25 నుంచి రుతుపవన వర్షాలు కురవనున్నాయి. ఈ నెల ఆకారి వరకు నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తరించి మంచి వర్షాలు పడనున్నాయి. వానల కోసం ఎదురుచూస్తున్నా రైతులు ఈ నెల 24 నుండి ఖరిఫ్ పంటల వ్యవసాయ పనులు నిరాటంకంగా మొదలుపెట్టవచ్చు. Courtesy: ASP