17 May , 2024

వరి కొయ్యలు తగలబెడితే జరిమానా !!

దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతోపాటు గడ్డిని కూడా కాలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల అధిక నష్టాలు వచ్చే అవకాశముందని వరి కొయ్యలు కాల్చే రైతులకు జరిమానా విధించాలని వ్యవసాయ శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పలు అంశాలపై సమీక్ష నిర్వహించి పంటల భీమ ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల విజ్ఞాప్తి మేరకు మట్టి నమూనా సేకరించి రిపోర్ట్ ఈ నెలాఖరుకు వచ్చేలా చూడాలని కోరారు.