23 May , 2024

రాష్ట్ర వ్యాప్తంగా మే 24న విత్తన మేళా !!

నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మే 24న రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా నిర్వహించనున్నారు. అదే రోజున విశ్వవిద్యాలయ పరిధిలోని జగిత్యాల, పాలెం, వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో, అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ మేళాల్లో 16 పంటల్లో 67 రకాలకు చెందిన దాదాపు 12 వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు.