15 Jul , 2024

గ్రామం భాగుండాలంటే తినే తిండి బాగుండాలి !!

ప్రజలు కోవిడ్ సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇంట్లోనే కూరగాయలను పండించుకొని తినేందుకు ఉత్సాహం చూపించారు. కోవిడ్ తగ్గిన తరువాత అంతా సాదారంగా మారిపోయింది. కేరళలోని మోప్పడం గ్రామానికి చెందిన అరుణ్ అనే రైతు గ్రామస్థుల ఆరోగ్యం గురించి అలోచించి “అందరం కలిసి పండించుకొని కావలసినవి తీసుకుందాం” అని ప్రారంబించారు. దీనికి అందరు సమ్మతించి 20 ఎకరాల్లో కావలసిన అన్ని పంటలకు ప్రణాళిక సిద్దం చేసి శ్రీకారం చుట్టారు. కావలసిన సేంద్రియ ఎరువులను సొంతంగా తయారు చేసుకొని పిల్లలు పెద్దలు స్వచ్చందంగా సహాయపడుతూ ఇతర గ్రామాలకు కుడా పంచుతూ ఆరోగ్యంగా ఉండి ఆదర్శంగా నిలిచారు కదా...! మీ అభిప్రాయం ఏంటి.....