16 Jul , 2024

23 నుంచి పొలం పిలుస్తోంది.... కార్యక్రమం !!

ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది అనే కార్యక్రమానికి క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో పాటు కేవీకేల శాస్త్రవేత్తలు పాల్గొంటారు. ఇందులో భాగంగా ఉదయం రైతు క్షేత్రాల్లో పర్యటించి పంటల స్థితిగతులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఆర్బీకేలో రైతులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమాలఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంతో పాటు వ్యవసాయ. అనుబంధ శాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవ గాహన కల్పించడం, సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందించడం చేస్తారు.