23 Jul , 2024

ఆంధ్రప్రదేశ్ రైతులకు ఖరీఫ్ సీజన్ ఎరువులు సిద్దం !!

ఖరీఫ్ సీజన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని, రైతుల కోసం విక్రయించేందుకు 1321 సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేయాలని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ఆదేశించారు . ఖరిఫ్ సీజన్ కోసం 17.50లక్షల టన్నుల ఎరువులను సిద్ధం చేయాలని వ్యవసాయ మంత్రి ఆదేశించారు. ఈ సీజన్ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువులు ఉన్నాయని, మిగిలిన వాటిని కూడా సకాలంలో రాష్ట్రానికి చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు .